అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. రీగన్ నేషనల్ ఎయిర్పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా పీఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన ప్రయాణికుల విమానం.. సైనిక హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆ రెండూ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నారు.