గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం BJ కాలేజ్ హాస్టల్పై కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు MBBS విద్యార్థులు మృతి చెందగా.. మరి కొందరి మృతదేహాలు భవన శిథిలాల కింద చిక్కుకున్నాయి. అయితే మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీస్తున్నారు. ఆ సమయంలో విద్యార్థుల కాళ్లు, చేతులు, ఇతర భాగాలు ముక్కలైపోయి కనిపించడం అందరినీ కలిచివేస్తోంది. ఈ హృదయవిదారక దృశ్యాలు SMలో వైరలవుతుండగా నెటిజన్లు కన్నీరు పెట్టుకుంటున్నారు.