అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఎంతో మంది జీవితాలలో తీరని విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 274 మంది మృతి చెందారు. అయితే ఈ దుర్ఘటనలో చనిపోయిన తమ సిబ్బందికి ఎయిరిండియా నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసింది. పైలట్స్, ఇతర సిబ్బంది చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ వీడియో నెటిజన్లను ఆవేదనకు గురి చేస్తున్నాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.