ప్లాట్ విషయంలో గొడవ.. కర్రలు, బండ రాళ్లతో దాడి (వీడియో)

81చూసినవారు
TG: ప్లాట్ విషయంలో గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. మేడ్చల్ సురారం పీఎస్ పరిధి కృషికాలనీలో 132 గజాల ప్లాట్ విషయంలో గొడవ జరిగింది. దీంతో స్వరాజ్యం, చైతన్య, లక్ష్మీ, అనూషతో పాటు మరికొంతమందిపై కర్రలు, బండలు, డ్రమ్ములతో ఓ వర్గం దాడి చేసింది. ఈ దాడిలో పల్లపు వీర్యయ్యకు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్