తెలంగాణలోని పోలీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి సైన్యంలా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మూటల వేట సీఎందే అయితే, సీఎస్, అధికారులు బలి పశువులవుతున్నారని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం ఐఏఎస్, అటవీ అధికారుల వంతైందని, అధికారులు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించారు.