యూపీలోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్లో భారీ హవాలా మనీ పట్టుబడింది. బనారస్ నుంచి బిహార్కి తరలించబడుతున్న రూ.35 లక్షల హవాలా డబ్బును GRP పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం లావాదేవీ 1 రూపాయి నోటు నంబర్తో జరిగిందిని అధికారులు తెలిపారు. పోలీసులు ఒక ఏజెంట్ను పట్టుకుని విచారణ చేపట్టగా, అతడు పలు ఆశ్చర్యకర విషయాలను వెల్లడించాడు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు.