TG: కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎన్నికల ప్రధానాధికారి(CEO) సుదర్శన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఓటర్లకు పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్లను విడగొట్టి కొత్త బూత్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకే పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులందరూ ఓటు వేసేలా సౌకర్యం కల్పించాలన్నారు. ఓటర్ ఐడీలో మార్పులు, చేర్పుల విషయంలో ప్రజలకు BLOలు సహకరించాలన్నారు.