ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఇవాళ మాఘ పూర్ణిమ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ప్రశాంత్ కిషోర్కు ఆలయ ప్రాంగణంలోని రంగనాయకులవారి మండపంలో టీటీడీ అర్చకులు వేదాశీర్వచనాలు పలికారు. అనంతరం స్వామివారి శేషవస్త్రాన్ని బహుకరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.