రాష్ట్రపతి శబరిమల పర్యటన రద్దు

58చూసినవారు
రాష్ట్రపతి శబరిమల పర్యటన రద్దు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శబరిమల పర్యటన రద్దు అయింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మే 19న శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. అయితే భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన రద్దు చేయబడింది. మే 18న కేరళలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్న అనంతరం, 19న శబరిమల వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కేరళ పర్యటన కూడా రద్దయింది.

సంబంధిత పోస్ట్