పదేళ్ల కాలంలో గత BRS ప్రభుత్వం వేల ఎకరాలు అమ్మిందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం వేల ఎకరాలను తనవారికి కట్టబెట్టిందని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాలను తన చుట్టూ ఉన్నవారికి అప్పనంగా అమ్ముకున్నారని ఫైర్ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల గురించి పదేళ్ల పాటు ఎందుకు పోరాడలేదు? అని ప్రశ్నించారు. HCU భూములైతే కోర్టు వివాదంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదన్నారు.