రెండు రోజుల విదేశీ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటన ముగించుకున్న ప్రధాని న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇరు దేశాల అత్యున్నత నేతలతో మాట్లాడి ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలపై చర్చించారు. మోదీ ఆస్ట్రియా నుంచి బయలుదేరిన తరువాత ప్రధానమంత్రి కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసింది.