భారత్ – పాక్ మధ్య పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్కు ఫోన్ చేసి మాట్లాడారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో రాష్ట్రంలోని భద్రతపై ఆయన ఆరా తీశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. అలాగే గుజరాత్లోని సెన్సిటివ్ ప్రాంతాలైన కచ్, బనాస్కాంఠా, పఠాన్, జామ్నగర్లో చేపడుతున్న చర్యల గురించి తెలుసుకున్నారు.