లారీని ఢీ కొన్న ప్రైవేటు బస్సు.. ఇద్దరి మృతి

62చూసినవారు
లారీని ఢీ కొన్న ప్రైవేటు బస్సు.. ఇద్దరి మృతి
TS: ఆదిలాబాద్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జందాపూర్‌ ఎక్స్‌ రోడ్డు సమీపంలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్‌ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు మరొకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్‌ నుంచి నాగ్‌పుర్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్