ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్పై కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. ‘ప్రధాని మోదీకి, అరవింద్ కేజ్రీవాల్కు ఎలాంటి తేడా లేదు. ఇద్దరూ పిరికిపందలు, అవినీతిపరులు’ అని ఈ సందర్భంగా ఆరోపించారు.