గురుద్వారాలో ప్రియాంకా గాంధీ ప్రత్యేక పూజలు (వీడియో)

57చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఉన్న గురుద్వారా, మానసా దేవి ఆలయాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మానసా దేవి ఆలయానికి వెళ్లిన ప్రియాంకా గాంధీ అమ్మవారిని దర్శంచుకున్నారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి ఆలయం నుంచి బయటికి వచ్చారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రియాంకాగాంధీ గురుద్వారాకు చేరుకున్నారు. అక్కడ సిక్కు భక్తులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

సంబంధిత పోస్ట్