నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. ఇది దేశ జీడీపీలో 0.18% అని పేర్కొంది. నోటి క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో మూడింట రెండొంతులు భారత్లోనే ఉన్నాయని తెలిపింది. 2019 నుంచి 2022 మధ్య 36 నెలల కాలంలో క్యాన్సర్ చికిత్స పొందిన 100 మంది రోగులను టీఎంసీ అధ్యయనం చేసింది.