ఓవైపు భారత్ దాడులతో పాక్ సైన్యం తీవ్రంగా దెబ్బతింటుండగా.. మరోవైపు మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అనుచరులు ఆ పరిస్థితిని అవకాశంగా మార్చుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ ఆర్మీపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీధుల్లోకి దిగారు. దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆందోళనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.