వక్ఫ్ బిల్లు సవరణ చట్టం-2025కి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ముర్షిదాబాద్ తర్వాత దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక ఘర్షణల్లో 8 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఓ పోలీస్ వ్యాన్, కొన్ని బైక్లు ధ్వంసం అయ్యాయి. ఇక ముర్షిదాబాద్లో ఇటీవల జరిగిన నిరసనలలో ముగ్గురు చనిపోగా, పెద్ద సంఖ్యలో గాయపడ్డారు.