దర్శకుడు సుకుమార్ వల్ల 'పుష్ప' కోసం పనిచేసిన తమ అందరి జీవితాలు అర్థవంతమయ్యాయని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేర్కొన్నారు. హైదరాబాద్లో శనివారం నిర్వహించిన 'పుష్ప-2' థ్యాంక్స్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడారు. 'పుష్ప-3 అదొక అద్భుతంలా, ఎనర్జీలా ఉంది. అదెప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ సుకుమార్ను చూసి గర్వపడుతోంది.' అని అన్నారు. సినిమా కోసం పనిచేసిన బృందానికి షీల్డ్లు అందించారు.