ఆర్మీ రిక్రూట్ మెంట్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకం పీఎంఓ కార్యాలయంలో రూపొందించారని ఆరోపించారు. దీన్ని రద్దు చేసి, పాత శాశ్వత నియామక ప్రక్రియను తిరిగి తీసుకువస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ పథకం భారత సైన్యం కాదు, మోడీ రూపొందించిన పథకం అని అన్నారు. అమరవీరులను వేర్వేరుగా చూడలేమని, దేశం కోసం అత్యున్నత త్యాగం చేసే ప్రతి ఒక్కరికీ అమరవీరుడి హోదా కల్పించాలని అన్నారు.