కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలోని దేశాలు ఏఐ, డ్రోన్ల సాంకేతికతపై వేగంగా పనిచేస్తున్నాయి. మనం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఈ దశలో దీనిపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. మీరు ఏఐ రంగంలో పనిచేస్తుంటే లేదా ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఏవైనా సూచనలు ఉంటే తెలియజేయండి’ అని ట్వీట్ చేశారు.