భారత రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ బుకింగ్ టైమ్లో ఇక నుంచి ఆధార్ తప్పనిసరి చేసింది. ఐఆర్సీటీసీ యాప్/వెబ్సైట్లో ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశముంటుందని రైల్వేశాఖ తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.