తెలంగాణలో రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్నగర్, కామారెడ్డి, మెదక్, నాగర్కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈదురుగాలులు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.