తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం కరీంనగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. మార్కెట్ యార్డులు, కల్లాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నుంచి మరో మూడు రోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.