తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్, జనగామ, కామారెడ్డి, భువనగిరి, నల్గొండ, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో వర్షం పడుతుందని పేర్కొంది.