తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు

68చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ తెలంగాణలోని 33 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, తదితర జిల్లాల్లో వర్షాలు కరుస్తాయని పేర్కొంది. అటు ఎపీలోనూ ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్