AP: ద్రోణి ప్రభావంతో వచ్చే 5 రోజులు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. వర్షాలతోపాటూ ఉరుములు, మెరుపులు కూడా వస్తాయని తెలిపింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో వీస్తాయని హెచ్చరించింది. ఏప్రిల్ 17న ఏపీలో వాతావరణం ఎక్కువగా పొడిగా ఉంటుందని, అయితే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. TGలో ఇవాళ బలమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.