రాజస్థాన్ హైకోర్టు 2015 ఆగస్టులో సంతారను చట్టవిరుద్ధమని, ఐపీసీ సెక్షన్లు 306, 309 కింద నేరమని తీర్పునిచ్చింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద మతపరమైన ఆచారం కాదని, ఆర్టికల్ 21లో చనిపోయే హక్కు లేదని స్పష్టం చేసింది. దీనిని నేరంగా భావించి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. జైన సమాజం పిటిషన్లతో సుప్రీంకోర్టు సంతారను మత సంప్రదాయంగా గుర్తిస్తూ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.