భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో భేటీ అయ్యారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తోనూ ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో భద్రతాపరమైన కీలక అంశాలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. కాగా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. నియంత్రణ రేఖ వెంట కాల్పులు కొనసాగిస్తోంది.