భారత్-పాక్ దేశాల మధ్య దాడి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ వివరాలను తెలుసుకుంటున్నారు. కాసేపట్లో మోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం కానున్నారు. రక్షణశాఖ కీలక సమావేశంలో చర్చించిన అంశాలను మోదీ దృష్టికి మంత్రి తీసుకెళ్లనున్నారు. CDS, త్రివిధ దళాధిపతులతో తాజాగా చర్చించిన పరిస్థితులను వివరించనున్నారు. పాక్ దాడులను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టిన తీరును త్రివిధ దళాధిపతులు ఇదివరకే రాజ్నాథ్కు వివరించారు.