ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు ఒంగోలు పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలును మార్ఫింగ్ చేశాడని.. RGVపై మద్దిపాడు PSలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు విచారణకు హాజరుకావాలని RGVకి పోలీసులు నోటీసులు పంపినా విచారణకు రాలేదు. అయితే రేపు విచారణకు వస్తున్నట్లు విచారణాధికారి CI శ్రీకాంత్కు RGV సమాచారం ఇచ్చారు.