ఏపీలోని ఓంగోలు పోలీసుస్టేషన్లో దర్శకుడు రామ్గోపాల్ వర్మ విచారణ ముగిసింది. సీఐ శ్రీకాంత్బాబు.. ఆర్టీవీని 9 గంటల పాటు విచారించారు. చంద్రబాబు, లోకేష్, పవన్లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, అనుచిత వ్యాఖ్యల కేసులో రామ్గోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు విచారణ చేశారు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఆర్టీవీకి పోలీసులు చెప్పారు. విచారణ అనంతరం ఒంగోలు నుంచి ఆర్జీవీ వెళ్లిపోయారు.