ఈ నెల 15న ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ సినిమాను పార్లమెంట్లో ప్రదర్శించనున్నారు. గీక్ పిక్చర్స్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటు సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు సైతం దీనికి హాజరుకానున్నారు. ఇది మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది’ అని గీక్ పిక్చర్స్ ఇండియా సహ వ్యవస్థాపకులు అర్జున్ అగర్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ రైటర్గా వర్క్ చేశారు.