లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసుల పరిష్కారానికి సులువైన మార్గం లభిస్తుందని చేవెళ్ళ జూనియర్ సివిల్ - జడ్జ్ దశరథ రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా శనివారం చేవెళ్ల కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పలు కేసులు ఇరువురిరాజీతో పరిష్కరించబడ్డాయి. జడ్జ్ శ్యామ్ కుమార్, రిటైర్డ్ జడ్జ్ లక్ష్మణ్ మాట్లాడుతూ లోక్ అదాలత్తో ఇరు వర్గాల వారు రాజీ పడడంతో సులువుగా కేసుల పరిష్కారం జరుగుతుందన్నారు.