ఇబ్రహీం పట్నం మండలం రాందాస్ పల్లి, మల్ శెట్టి గూడలో పురుగులు పట్టిన రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పురుగులు పట్టిన సన్నబియ్యం తింటే బ్రతుకుతమా అని మహిళలు మండిపడుతున్నారు. ఇలాంటి బియ్యం తింటే ఇంకా అనారోగ్యాల భారిన పడతామని ఆందోళన వ్యక్తం చేశారు.