రంగారెడ్డి జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థానీయులు, బంగ్లాదేశ్ రోహింగ్యాలను బహిష్కరించాలని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి కార్పొరేటర్లు, నాయకులతో కలిసి గురువారం ఆయన వినతిపత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో కొన్ని ప్రాంతాల్లో రోహింగ్యాలు, పాకిస్థానీయులు అక్రమంగా నివసిస్తున్నారని అనుమానాస్పద ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్ చేపట్టి అక్రమ వలసదారులను గుర్తించి చర్యలు చేపట్టాలని కోరారు.