లోతట్టు కాలనీలలో మురుగు, వరద ముంపు సమస్య పరిష్కారానికి వరదనీటి కాలువలు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని కర్మన్ ఘాట్ ఓల్డ్ విలేజిలో గురువారం సర్కిల్ అధికారులతో కలిసి పర్యటించారు. భూగర్భ డ్రైనేజీ, మురుగు సమస్యను పరిశీలించారు. త్వరలో ప్రత్యేక నిధులతో వరద నీటి కాలువ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.