
ఇక్రిశాట్లో చిరుత కలకలం.. చివరికి బోనులో చిక్కింది
TG: హైదరాబాద్ పటాన్ చెరు సమీపంలోని ఇక్రిశాట్లో చిరుత కలకలం రేగింది. రెండు మూడు రోజులుగా ఇక్రిశాట్ పరిశోధన క్షేత్రాల్లో చిరుత సంచరించింది. సిబ్బంది ఫిర్యాదుతో అటవీశాఖ అధికారులు బుధవారం ఉదయం సీసీ కెమెరాలు, బోను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బోనులో చిక్కడంతో శాస్త్రవేత్తలు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. చిరుతను HYD నెహ్రూ జూ పార్కుకు అధికారులు తరలించనున్నారు.