చెత్త వేయడానికి బయటకు వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైంది. నల్గొండ జిల్లా మర్రిగూడం మండలం కొడన్పల్లికి చెందిన తాండారుపల్లి లక్ష్మమ్మ భర్త ఇస్తారితో కలిసి నాగోలు సాయినగర్ కాలనీ రోడ్డు-3లో ఉంటున్నారు. లక్ష్మమ్మ ఖైరతాబాద్లోని దక్కన్ గ్రామీణ బ్యాంక్లో అటెండర్ గా పని చేస్తోంది. గత నెల 29న భార్యాభర్తల మధ్య వ్యవసాయ భూమి విషయంలో చిన్న గొడవ జరిగింది. 30న చెత్త వేయడానికి బయటకు వెళ్లిన లక్ష్మమ్మ ఇంటికి రాలేదు.