ఆమనగల్లు: ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

54చూసినవారు
ఆమనగల్లు: ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ఎరువులు, విత్తన డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహారావు హెచ్చరించారు. గురువారం ఆయన ఆమనగల్లు పట్టణంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాలలోని స్టాక్ రిజిస్టర్స్, బిల్ బుక్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డీలర్ వ్యవసాయ శాఖ నిబంధనలు పాటించాలని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్