కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకొని ఈనెల 29, 30వ తేదీలలో మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు పండుగకు కల్వకుర్తి నియోజకవర్గం నుండి రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. గురువారం ఆమనగల్లులో మాట్లాడుతూ రైతు పండుగలో ఆధునిక వ్యవసాయంపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు.