శాసనసభలో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.