పదవులు, అధికారం కోసం ఎప్పుడు బీజేపీ పాకులాడదని, కేవలం పార్టీ సిద్ధాంతాలు, దేశం భద్రత, ప్రజల బాధ్యత కోసమే పని చేస్తుందని శనివారం బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సేవెల్ల మహేందర్ అన్నారు. మండల కేంద్రంలో బీజేవైఎం మండల కార్యవర్గ కమిటీ ఎన్నుకోవడానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మహేందర్ హాజరయ్యారు. బీజేపీ మండల అధ్యక్షురాలు రోల్లు రాధిక గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.