బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి వ్యక్తి మృతి

75చూసినవారు
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి వ్యక్తి మృతి
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఒకరు మృతి చెందిన ఘటన బాలాపూర్ చౌరస్తాలో శుక్రవారం చోటుచేసుకుంది. జిల్లెల్లగూడకు చెందిన శివయ్య అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బాలాపూర్ చౌరస్తా పని కోసం వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. పది రోజులుగా ఓప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్