తలకొండపల్లి: భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వేడుకలు

61చూసినవారు
తలకొండపల్లి: భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వేడుకలు
తలకొండపల్లి మండలం దేవుని పడకల్లు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్ మాసం ముగింపును పురస్కరించుకొని వైకుంఠ ఏకాదశి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున మహిళలు మంగళ హారతులతో ఆలయానికి చేరుకొని ఉత్తర ద్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేసి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమ్రోగగా భక్తులతో కిటకిటలాడినది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్