రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి సెక్టార్ గణేష్ నగర్ అంగన్వాడీ సెంటర్ లో గురువారం మెదడువాపు టీకాలు ఇవ్వడం జరిగింది. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు 9 నెలల పిల్లల నుండి 15 సంవత్సరాల పిల్లల వరకు మెదడువాపు వ్యాధి నివారణకు జేఈ వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో నవయువయూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి, అంగన్వాడీ టీచర్ శోభ, ఏఎన్ఎం వసంత, ఆశా వర్కర్లు లక్ష్మి, నాగవేణి, అనురాధ, రేణుక, రూపాదేవి పాల్గొన్నారు.