రాజేంద్రనగర్ సర్కిల్కు చెందిన నవయువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి శుక్రవారం ప్రకటించారు. ఈ వేడుకలు మే 11న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, మైలర్ దేవ్పల్లి డివిజన్లోని భావన ఋషి కాలనీ వద్ద ఉన్న శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో జరగనున్నాయి. అందరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.