మైలార్దేవ్పల్లి సెక్టార్ పరిధిలోని శేరిలింగంపల్లి ప్రాజెక్టు పరిధిలో బుధవారం "అమ్మ మాట అంగన్వాడీ బాట" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి, తల్లుల పాత్రను గుర్తించేందుకు, బాలల ఆరోగ్యం, విద్యపై దృష్టి పెట్టేందుకు ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్) ఆధ్వర్యంలో నిర్వహించారు.