దేశ రక్షణలో తన ప్రాణాలను అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన వీర సైనికుడు మురళి నాయక్ అమరులైన వార్త మమ్మల్ని తీవ్రంగా కలచివేసిందని రాజేంద్రనగర్ సర్కిల్ నవ యువ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి శుక్రవారం అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ సేవే ధ్యేయంగా సైన్యంలో చేరి, అత్యున్నత విధేయతతో దేశానికి సేవచేసి చివరికి తన ప్రాణాలను ధైర్యంగా అర్పించిన మురళి నాయక్ నిజమైన దేశభక్తుడిగా, యోధుడిగా చిరస్మరణీయులయ్యారన్నారు.