దీపావళి పండగను పురస్కరించుకుని యాదవులు నిర్వహించే సదర్ ఉత్సవాలను నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం రాత్రి 8గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వెంకటేశాయాదవ్ తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు పలు జాతులకు చెందిన దున్నపోతులను రప్పిస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు.